చదివారా? 📕📕📕📕📕📕📕📕📕 *ఎందుకు సోషలిస్టు విప్లవం?* ( రచన *షేక్ అబ్దుల్ కరీమ్* ) *పరామర్శ : వి. విజయ కుమార్* * పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ కార్యక్రమాన్నీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణ విధానాన్నీ, కార్మిక వర్గ అంతర్జాతీయతకు కట్టుబడి పని చేసే ఒక నూతన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ ఆవశ్యకతనూ గుర్తించి, దానికై ప్రచార ఉద్యమాన్నీ, నిర్మాణ కార్యకలాపాల్నీ నిర్వహించే ఒక రాజకీయ నిర్మాణ వేదికగా, శాస్త్రీయ కమ్యూనిజపు మార్గదర్శకత్వంలో నడిచే కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ తరపున షేక్ అబ్దుల్ కరీం గారు ఎందుకు సోషలిస్టు విప్లవం? అనే పేరున వేర్వేరు సందర్భాల్లో రాసిన ఇంచుమించు 18 అంశాలను ఒక పుస్తక రూపంగా వెలువరించారు. ఆయా వ్యాసాల్లో వేరువేరు సందర్భాల్లో సోషలిస్టు విప్లవ అంశాలను తడిమారు. సంక్షిప్తంగా కొన్ని విషయాల్ని ఇందులో సమీక్షించాను. 1994 లో పీపుల్స్ వార్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత తానెంత సంఘర్షణకు లోనైందీ, కామ్రేడ్ కె ఎస్ సంక్షోభానికి మూల కారణాలు అన్వేషిస్తూ సాగిన అధ్యయనం ద్వారా తనకు ఒక సమాధానం ఎలా లభించిందీ, దాని పర్యవసనాల ఫలితంగా అది పెట్టుబడిదారీ వ్యతిరేక సో...
Popular posts from this blog
పెట్టుబడిదారీ దేశంలో కార్మిక వర్గం యొక్క శక్తి కేవలం దాని సంఖ్యలో ఉండదు... ‘ఏ పెట్టుబడిదారీ దేశంలోనైనా కార్మిక వర్గం యొక్క బలం, మొత్తం జనాభాలో ఆ వర్గం ప్రాతినిధ్యం వహించే జనాభా నిష్పత్తి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క నాడీ కేంద్రాలన్నింటిలోనూ కార్మిక వర్గం ఆధిపత్యంలో ఉంటుంది. అంతే కాకుండా, పెట్టుబడిదారీ విధానంలో అణగిపోతున్న శ్రామిక జనాభాలో అత్యధిక మెజారిటీ యొక్క వాస్తవ ప్రయోజనాలను రాజకీయంగానూ, ఆర్థికంగానూ కార్మిక వర్గం వ్యక్తీకరిస్తుంది.’ - లెనిన్ మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు. కార్మిక వర్గ పార్టీ కి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న ,తక్కువ వేతనాలతో దుర్బర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక,కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల,శ్రామికుల పై ఆధార పడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్దతు...
మోజేస్
మోజెస్ రాజీపడి ఈజిప్ట్ చక్రవర్తి అయితే ఎర్ర సముద్రాన్ని చీల్చి హిబ్రూ బానిసలను దాటించి విముక్తి చేయగలిగే వాడా ?. మరియు 10 కమాండ్మెంట్స్ తెచ్చేవాడా?. పెట్టి బూర్జువా వర్గంతో అవకాశవాద రాజి పడిన వాడు సరైన విప్లవ సిద్ధాంతం రూపొందించగలడా? విప్లవాన్ని ఎలా సాధించగలడు. గబ్బర్ సింగ్ ను పట్టటానికి ఎంచుకున్న వీరులను కట్టప్ప లాగా తానే అంతం చేసి న ఠాకూర్ ను చూసి" దేఖో ఠాకూర్ సాబ్ నే సచ్ ముచ్ హిజ్దో న్క. ఫౌజ్ బనాయా "అనీ గబ్బర్ ఎగతాళి చేయడా?. నిజమే కదా ఎవరి తప్పుకు వారే నష్టపోతారు. చరిత్రకు కనికరం వుండదు,మామా ఠాకూర్ జీ. అబ్దుల్ కరీం. 27-6-2023.
Comments
Post a Comment